జన్వాడ ఫామ్హౌస్పై ప్రజా కోర్టే తేల్చాలె
ఫామ్హౌస్పై డ్రోన్ కేసులో కోర్టు తీర్పుపై రేవంత్ ట్వీట్
హైదరాబాద్, వెలుగు : జన్వాడ ఫాంహౌస్పై డ్రోన్ను ఎగరేసి కేటీఆర్కు ప్రాణహాని తలపెట్టానంటూ పోలీసులు తనను జైలులో పెట్టారని, అసలు ఆ ఫాంహౌస్ తనది కాదన్న కేటీఆర్ వాదనకు హైకోర్టు అనుకూలమైన తీర్పునిచ్చిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. జన్వాడ ఫాంహౌస్పై రేవంత్ వేసిన పిటిషన్ చెల్లదంటూ బుధవారం హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నిస్తూ గురువారం ట్వీట్ చేశారు. నిజం ఏంటో ‘ప్రజా కోర్టు’ తేల్చాలని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పు కాపీ, పత్రికా కథనాన్ని ఆయన ట్వీట్కు జోడించారు.