ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత

ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత

ప్రముఖ నిర్మా, సినీ పీఆర్వో, జర్నలిస్టు బిఏ రాజు(61)  శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయన  హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన సతీమణి  జయ ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు, కాలమిస్ట్ , దర్శకురాలు.ఆమె రెండు సంవత్సరాల క్రితం మరణించారు. బి ఏ రాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.