రెండు వైపులా మెట్రో రైళ్లు దూసుకొస్తున్నాయి. ఈ సమయంలో ఆటాడుకుంటూ ఒక్కసారిగా పట్టాలపై దూకాడు. కుమారుడిని పట్టుకునేందుకు కన్న తల్లి కూడా పట్టాలపైన కిందపడబోయేది. ఈ సమయంలో సెక్యూరిటీ గార్డు చేసిన ఒక్క పనితో ఆ తల్లీబిడ్డలు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గ్రహించి చాకచక్యంతో స్పందించి ప్రాణాలు కాపాడిన ఆ సెక్యూరిటీ గార్డుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రయాణ సమయాల్లో.. బాహ్య ప్రదేశాల్లో చిన్నారులను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఈ సంఘటన చెబుతుంది. దీంతోపాటు ప్రమాదం సమయంలో సమయస్ఫూర్తిగా ఎలా వ్యవహరించాలో కూడా ఈ సంఘటన ఉదాహరణగా ఉపయోగపడుతుంది. ప్రమాదం సమయంలో వాటి నివారణకు ఉన్న అవకాశాలను ఎలా వినియోగించుకోవాలో కూడా ఈ ఒక్క ఘటన సూచిస్తుంది. మహారాష్ట్రలోని పుణె సివిల్ కోర్టు అనే మెట్రో స్టేషన్లో ఓ ఘటన జరిగింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది.
Pune Metro News : Brave act by guard saves mother son duo's life who fell on tracks near Civil Court Elevated Station #Pune #civilcourt #civilcourtelevatedstation #punemetro #guardlivessaved pic.twitter.com/A15qrxjdmb
— Pune Pulse (@pulse_pune) January 19, 2024
ఓ తల్లి... బిడ్డ మెట్రో ట్రాక్పై నడుస్తుండగా బిడ్డ పడిపోయింది. తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో మహిళ కూడా ట్రాక్పైకి దూకింది. అక్కడ ఉన్న వ్యక్తులు మహిళకు సహాయం చేసేందుకు పరుగులు తీశారు. ఈ సమయంలో స్టేషన్లో ఉన్న సెక్యూరిటీ గార్డు వికాస్ బంగర్ ఎమర్జెన్సీ బటన్ను నొక్కాడు. దాని కారణంగా ఇన్కమింగ్ రైలు ఆగిపోయింది. మెట్రో స్టేషన్కు కేవలం 30 మీటర్ల దూరంలో ఇన్కమింగ్ రైలు ఆగింది. ఈ ఘటన నేపథ్యంలో చిన్న పిల్లలతో ప్రయాణించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పూణే మెట్రో విజ్ఞప్తి చేసింది.