మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు.. 10శాతం వ్యాట్ పెంచిన ప్రభుత్వం

మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు.. 10శాతం వ్యాట్ పెంచిన ప్రభుత్వం

పంజాబ్ ప్రభుత్వం ఇంధనంపై 10శాతం వ్యాట్ ని  పెంచింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటరుకు 92 పైసలు, 88 పైసలు పెరిగాయి.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, వ్యాట్ పెంపుతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఒక రూపాయి పెరుగుతాయి. తాజా ప్రకటనతో మొహాలీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 98.95 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.89.25కు చేరుకుంది. చండీగఢ్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.96.20 కాగా, డీజిల్ ధర లీటరు రూ. 84.26 గా ఉంది.

రాష్ట్రంలో ఇంధన ధరలు పెంచడం ఈ ఏడాది ఇది రెండోసారి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు స్థిరంగా ఉండి, వచ్చే త్రైమాసికంలో కంపెనీలు లాభదాయకంగా ఉంటే చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించవచ్చని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవలే అన్నారు. ఇక ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏప్రిల్ 2022 నుంచి చమురు ధరల పెరుగుదలను నిరోధించిందని, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చూస్తుందని బీజేపీ తెలిపింది. కానీ తాజా నిర్ణయంతో అది అమలు కానట్టు తెలుస్తోంది.

https://twitter.com/ANI/status/1667774884192329729