చాక్లెట్లు తిని రక్తం కక్కుకున్న చిన్నారి...

చాక్లెట్లు తిని రక్తం కక్కుకున్న చిన్నారి...

ఎక్స్పైర్ అయిన చాక్లెట్లు తిని చిన్నారి రక్తం కక్కుకున్న సంఘటన పంజాబ్ లోని పాటియాలాలో చోటు చేసుకుంది.లుధియానాకు చెందిన ఏడాదిన్నర బాలికను తల్లిదండ్రులు పాటియాలాలోని చుట్టాల ఇంటికి తీసుకెళ్లారు, అక్కడ ఆ చిన్నారికి ఒక చెక్లెట్ బాక్స్ గిఫ్ట్ గా ఇచ్చారు బంధువులు. ఇంటికి వెళ్ళాక అవి తిన్న చిన్నారి రక్తం కక్కుకుంది. దీంతో ఆందోళన చెందిన పేరెంట్స్ హుటాహుటిన హాస్పిటల్ కి తరలించగా చికిత్స అందించిన డాక్టర్లు చాక్లెట్లు ఎక్ప్పైర్ అయినట్లు గుర్తించారు.

చిన్నారికి ప్రాణాపాయం తప్పటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయగా సదరు షాప్ మీద దాడి చేసి ఎక్స్పైర్ అయిన చాక్లెట్లు, ఇతర స్నాక్ ఐటమ్స్ ను సీజ్ చేసారు అధికారులు.