కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లు : పురందేశ్వరి

కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లు : పురందేశ్వరి
  • ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడి  
  • మహేశ్వరం అభ్యర్థి అందెల శ్రీరాములుకు మద్దతుగా ప్రచారం

బడంగ్ పేట, వెలుగు: దళితులను దగా చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. మహేశ్వరం సెగ్మెంట్ లోని ఆర్కేపురంలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములుకు మద్దతుగా గురువారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. దళితబంధు స్కీమ్​లో అవినీతి జరుగుతుందని స్వయంగా కేసీఆరే ఒప్పుకున్నారన్నారు. 

కేంద్ర నిధులతో రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు జరిగాయని ఆమె తెలిపారు. తెలంగాణలో జనం మార్పును కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ హామీలు.. నీటి మూటలుగా మారాయన్నారు. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయారని ఆమె ఆరోపించారు. కార్యక్రమంలో అందెల శ్రీరాములు, ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.