ముషీరాబాద్, వెలుగు : వెహికల్విక్రయించగా వచ్చిన కమీషన్ కోసం మొదలైన గొడవ గ్రూప్వార్కు దారితీసింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో రాంనగర్ లోని ఓ హోటల్ వద్ద జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయపడిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ వెహికల్విక్రయించగా వచ్చిన డబ్బును కమీషన్ రూపంలో పంచుకోవడంలో రాంనగర్లోని ఓ హోటల్వద్ద ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
అక్కడే ఉన్న ఇరువురికి చెందిన దాదాపు 50 యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ముషీరాబాద్ పోలీసులు దాడులకు పాల్పడ్డవారిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం ముజీబ్, అక్బర్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసిన్నట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు.