హైదరాబాద్: సోమవారం ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రారంభం కానుంది. శాసనమండలిలో పలు అంశాలపై చర్చించనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1) ప్రభుత్వ ఉద్యోగులకు కోత విధించిన వేతనాల చెల్లింపు
2) వరంగల్ మహానగర పాలక సంస్థలో అభివృద్ధి పనులు
3) విద్యుత్తు నీరు మరియు పురపాలక పన్నుల తగ్గింపు/ మాఫీ
4) పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక అభివృద్ధి.
5) జిహెచ్ఎంసి పరిధిలో లింకు రహదారులు.
6) గౌడ సామాజిక వర్గానికి కల్లుగీత లో శిక్షణ
ఉభయసభల్లో ఈరోజు బిల్లులు ఉన్నకారణంగా స్వల్పకాలిక చర్చ రద్దు
మండలిలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి రెవెన్యూ బిల్లుల పై చర్చించనున్నారు
తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ను మండలి ఆమోదం కోసం చర్చ పెట్టనున్న సీఎం కేసీఆర్.