రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు..అడ్డుకుంటున్న పోలీసులు

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు..అడ్డుకుంటున్న పోలీసులు

బీజేపీ నిరసనల్లో జీడిమెట్ల ఎస్ఐ ఓవరాక్షన్ చేశారు. కుత్బుల్లాపూర్ చౌరస్తాలో కరెంట్ చార్జీలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా.. జీడిమెట్ల ఎస్ఐ ఆంజనేయులు వచ్చి కాలితో దిష్టిబొమ్మను తన్నారు. అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలపై మంటలు పడ్డాయి. దీంతో పోలీసులకు బీజేపీ నాయకులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నించారుబీజేపీ నేతలు. ఎస్ఐ ఆంజనేయులును వెంటనే సస్పెండ్ చేయాలని కుత్బుల్లాపూర్ సిగ్నల్ వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. 

రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని చేనేత విగ్రహం నుండి సెస్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు బీజేపీ కార్యకర్తలు. నల్గొండలో  బీజేపీ ఆధ్వర్యంలో  కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కొండేటి సరిత చేతికి గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లాలో  కరెంట్ చార్జీల  పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోనీ విద్యుత్ భవన్ ను ముట్టడించిన బీజేపీ నాయకులు.