బీసీల లెక్క తీయండి

బీసీల లెక్క తీయండి
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆర్. కృష్ణయ్య వినతి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో వచ్చే ఏడాదిలో నిర్వహించనున్న దేశ జనాభా గణనలో బీసీ కులాల వారీగా సేకరణ జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని శనివారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఏడాది కిందట బీసీ కులాల వారీ లెక్కలు సేకరించాలని హోంశాఖ మంత్రివర్గ కోర్ కమిటీ సమావేశం నిర్ణయించిందని, ఆ తర్వాత సర్క్యులర్ కూడా జారీ చేసిందని గుర్తుచేశారు.

ఎస్సీ, ఎస్టీ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర కాలమ్స్ తో కేంద్ర హోంశాఖ ఈ మధ్యే నమూనా పత్రం జారీ చేసిందని అందులో బీసీ కాలమ్ లేదని మంత్రి దృష్టికి తెచ్చారు. బీసీ కులాల వారీ లెక్కలకు సంబంధించి ప్రత్యేక కాలమ్‌‌‌‌ పెట్టించాలని, పార్లమెంట్‌‌‌‌లో బీసీ బిల్లు పెట్టి.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 % రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.