ఆస్తులు కొల్లగొట్టే కుట్ర: రాష్ట్ర బంద్​కు ఆర్.కృష్ణయ్య మద్దతు

ఆస్తులు కొల్లగొట్టే కుట్ర: రాష్ట్ర బంద్​కు ఆర్.కృష్ణయ్య మద్దతు

ఆర్టీసీ కార్మికులు ఈ నెల 19న చేపట్టనున్న తెలంగాణ సంపూర్ణ బంద్‌‌కు మద్దతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌‌లో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి.. రూ.85 వేల కోట్ల ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తోందని ఆరోపించారు. ప్రైవేటుపరం చేస్తే బస్ చార్జీలు మూడు, నాలుగు రెట్లు పెరిగి.. పేదలు నష్టపోతారని మండిపడ్డారు. సమ్మె వల్ల రాష్ట్రంలో ప్రజా జీవనం స్తంభించిందన్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.