సీసీఎల్ మ్యాచ్​లకు కట్టుదిట్టమైన భద్రత రాచకొండ సీపీ తరుణ్ జోషి

సీసీఎల్ మ్యాచ్​లకు కట్టుదిట్టమైన భద్రత     రాచకొండ సీపీ తరుణ్ జోషి
  •     రాచకొండ సీపీ తరుణ్ జోషి

సికింద్రాబాద్, వెలుగు :  మార్చి1 నుంచి మూడు రోజుల పాటు ఉప్పల్​ క్రికెట్​ స్టేడియంలో జరగనున్న సెలబ్రెటీ క్రికెట్ లీగ్​కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. మంగళవారం డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలతో మంగళవారం కమిషనరేట్​లో సమీక్ష నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ.. వివిధ భాషల సినిమా తారలు ఆడుతున్న టీ20 క్రికెట్​మ్యాచ్​లకు ఫ్యాన్స్​ భారీగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. టికెట్ల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. డీసీపీలు పద్మజ,  కరుణాకర్, అరవింద్ బాబు, ఏసీపీలు శ్రీధర్ రెడ్డి,  పురుషోత్తంరెడ్డి, నరేశ్​రెడ్డి, నరేందర్ గౌడ్, సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ఫౌండర్ విష్ణు వర్ధన్ పాల్గొన్నారు.