- రాచకొండ సీపీ తరుణ్ జోషి
సికింద్రాబాద్, వెలుగు : మార్చి1 నుంచి మూడు రోజుల పాటు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న సెలబ్రెటీ క్రికెట్ లీగ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. మంగళవారం డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలతో మంగళవారం కమిషనరేట్లో సమీక్ష నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ.. వివిధ భాషల సినిమా తారలు ఆడుతున్న టీ20 క్రికెట్మ్యాచ్లకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. టికెట్ల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. డీసీపీలు పద్మజ, కరుణాకర్, అరవింద్ బాబు, ఏసీపీలు శ్రీధర్ రెడ్డి, పురుషోత్తంరెడ్డి, నరేశ్రెడ్డి, నరేందర్ గౌడ్, సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ఫౌండర్ విష్ణు వర్ధన్ పాల్గొన్నారు.