ఇంటర్ నేషనల్ డ్రగ్స్ ముఠా అరెస్టు.. రూ.55 లక్షల డ్రగ్స్ సీజ్

ఇంటర్ నేషనల్ డ్రగ్స్ ముఠా అరెస్టు.. రూ.55 లక్షల డ్రగ్స్ సీజ్

నగరంలో ఇంటర్ నేషనల్ డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి.. రూ.55 లక్షల విలువైన డ్రగ్స్‭ని సీజ్ చేశారు. నిందితులు మలేషియా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి.. ఆస్ట్రేలియాలో అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ ముఠా డ్రగ్స్, గోల్డ్, ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను మహారాష్ట్ర, పూణెకు చెందిన షేక్ ఫరీద్ మహ్మద్, ఫైజాన్‭లుగా గుర్తించారు. ఇతర వస్తువుల్లో డ్రగ్స్ పెట్టి అనుమానం రాకుండా విదేశాలకు కొరియర్ ద్వారా సప్లై చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ముఠాకి తెలంగాణకి సంబంధం లేదన్నారు. చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇక ట్రాన్స్ పోర్ట్ చేసే వారితో పాటు డ్రగ్స్ ఫెడ్లర్లు, సేవించే వారిపైనా నిఘా పెట్టామని రాచకొండ సీపీ చౌహాన్ స్పష్టం చేశారు.