వీళ్లు దేశముదుర్లు : కటకటాల్లోకి దొంగ నోట్ల ముఠా

వీళ్లు దేశముదుర్లు : కటకటాల్లోకి దొంగ నోట్ల ముఠా

హైదరాబాద్ : ఫేక్ కరెన్సీ నోట్ల ముఠా, డ్రగ్స్ ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వెయ్యి రూపాయలకు మూడు వేలు ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్న ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.60 లక్షల నకిలీ కరెన్సీ, ఒక కారు, ఆరు మొబైల్ ఫోన్లు, ఒక పోలీసు లాఠీని స్వాధీనం చేసుకున్నారు.

అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను కూడా అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. నిషేధిత మత్తు పదార్థాలను యువతకు అమ్ముతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం పోలీసులు రంగంలోకి దిగారు. బెంగళూర్ నుండి హైదరాబాద్ కు HMDA మత్తు పదార్థాన్ని తీసుకొచ్చి.. ఇక్కడ అమ్ముతున్న ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల సహాయంతో డ్రగ్స్ ముఠా సభ్యులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 30 గ్రాముల HMDA డ్రగ్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.