
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇన్చార్జి ఈవోగా రాధాబాయి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రస్తుతం వేములవాడ ఇన్చార్జి ఆర్డీవోగా పనిచేస్తున్నారు. అనంతరం రాజన్నను దర్శించుకున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఈవో వినోద్రెడ్డి దేవాదాయ శాఖ రాష్ట్ర కార్యాలయంలో డిప్యూటి కమిషనర్గా బదిలీపై వెళ్లారు.