కేటీఆర్ ట్వీట్కు రఘునందన్ రావు కౌంటర్

కేటీఆర్ ట్వీట్కు రఘునందన్ రావు కౌంటర్

హైదరాబాద్:  టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. బీజేపీ నేతలేమైనా సత్య హరిశ్చంద్రుని బంధువులా అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా...  ఆయనకు కౌంటర్ ఇస్తూ  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ట్వీట్ చేశారు. దర్యాప్తు సంస్థలు అంటే కేటీఆర్ కు ఎందుకంత ఉలికిపాటు అని ప్రశ్నించారు. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం అంటే ఇదేనేమో అంటూ సెటైర్ వేశారు.

అంతకు మందు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. "గత ఎనిమిదేళ్లలో బీజేపీ నేతలు, వారి బంధువులు, సన్నిహితులపై ఎన్నిసార్లు ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగాయి? బీజేపీ నేతల బంధువులంతా సత్యహరిశ్చంద్రుని బంధువులా" అని ట్విట్టర్ లో ప్రశ్నించారు.