రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం

రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. కాలేజీలోని సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా 20 మంది విద్యార్థులు లేఖలు రాసి, వాటిని ఫిర్యాదు బాక్స్ లో వేశారు. ఈ విషయంపై విద్యార్థులు పలుమార్లు హెచ్చరించినా సీనియర్స్ పద్ధతి మార్చుకోకపోవడంపై జూనియర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ క్రమంలో మరోసారి జూనియర్ విద్యార్థుల పై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడడంతో యాజమాన్యం స్పందించింది. జూనియర్ విద్యార్ధుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి 34 మంది విద్యార్థులపై చర్యలు తీసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడిన 34 మంది విద్యార్థులను వీసీ సస్పెండ్ చేశారు.