మోడీని ఎదుర్కోవడం రాహుల్​తో కాదు! : సీఎం మమతా బెనర్జీ

మోడీని ఎదుర్కోవడం రాహుల్​తో కాదు! :  సీఎం మమతా బెనర్జీ

కోల్​కతా: ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే అతిపెద్ద టీఆర్పీ అని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. పార్లమెంటులో చర్చించాల్సిన కీలక అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకే రాహుల్​ను బీజేపీ హీరోగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. రాహుల్ ప్రతిపక్షాల లీడర్ అయితే మోడీని ఎదుర్కోవడం సాధ్యం కాదని మమత అన్నారు. ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె కాంగ్రెస్​పై మండిపడ్డారు. ‘‘రాహుల్ విదేశాలకు పోయి ఏదో కామెంట్ చేసిండని వాటి గురించి పార్లమెంటు సమావేశాలనే జరగనివ్వట్లేదు. అదానీ, ఎల్ఐసీ, గ్యాస్ ధరల పెంపు వంటి బర్నింగ్ ఇష్యూలపై చర్చ జరగకుండా ఉండేందుకే బీజేపీ ఈ వ్యూహం అనుసరిస్తోంది. ప్రతిపక్షాలు ప్రజల సమస్యలను లేవనెత్తే పరిస్థితే లేకుండా చేస్తున్నది. బీజేపీతో పోరాడటంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది”  అని మమతా బెనర్జీ అన్నారు.