- పెట్రోల్పై మనదగ్గరే మస్తు ట్యాక్స్
- పన్ను పైసలు ఏడికి పోతున్నయని సర్కారును నిలదీయాలె: రాహుల్
- 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గోవాలో ప్రచారం స్టార్ట్
పణజి: ప్రపంచంలో పెట్రోల్పై ట్యాక్స్ఎక్కువ వసూలు చేస్తున్న దేశాల్లో ఇండియానే టాప్లో ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లపెంపుతో దేశంలో ఇద్దరు, ముగ్గురు బిజినెస్మెన్లే లాభపడుతున్నారని చెప్పారు. ‘యూపీ సర్కారు హయాంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్కు140 డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు బ్యారెల్ రేటు చాలా తక్కువగా ఉంది. కానీ ప్రజలంతా పెట్రోల్, డీజిల్కు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు’ అన్నారు. వచ్చే ఏడాది గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ తరఫున రాహుల్ శనివారం ప్రచారం స్టార్ట్ చేశారు. ఒకరోజు పర్యటనలో భాగంగా పొద్దున గోవా చేరుకొని, మధ్యలో రోడ్డు పక్కన హోటల్లో భోజనం చేశారు. ఆ తర్వాత వెల్సావో బీచ్లో ఫిషర్మెన్తో ఆయన మాట్లాడుతూ.. ట్యాక్స్ డబ్బంతా ఎక్కడికిపోతోందో ప్రభుత్వాన్ని ప్రజలంతా అడగాల్సిన టైమ్ వచ్చిందన్నారు. పెట్రోల్ రేట్ల పెంపు, గోవాలో కోల్ హబ్ తో ఎవరు లాభపడుతున్నారో ప్రశ్నించాలన్నారు.
అందరితో మాట్లాడి మేనిఫెస్టో రెడీ చేస్తం
గోవాలోని వివిధ వర్గాల ప్రజలందరితో మాట్లాడి, చర్చించి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రెడీ చేస్తామని రాహుల్ చెప్పారు. తమ ఎన్నికల మేనిఫెస్టో కేవలం కమిట్ మెంట్ కాదని.. గ్యారంటీ అన్నారు. ‘మీ టైమ్ను, నా టైమ్ను వేస్ట్ చేయడానికి నేనిక్కడికి రాలేదు. నాకు నా క్రెడిబిలిటీ ముఖ్యం. ఇక్కడేదైనా చెప్తే అది జరిగేలా చూస్తాను’ అన్నారు.
బీజేపీ జనాన్ని రెచ్చగొట్టి వీడదీస్తోంది
గోవా బీచ్లో విపరీతంగా నిర్మాణాలు వెలుస్తున్నాయని ప్రజలు కంప్లైంట్ చేయగా.. అధికారంలోకి వస్తే గోవాను కోల్ హబ్గా మారనీయబోమని రాహుల్ హామీ ఇచ్చారు. కాగా, పణజి మర్గావ్ హైవేలో ఉన్న బాంబోలిమ్ గ్రామంలో రాహుల్ ఆగి రోడ్డుపక్కనున్న హోటల్లో లంచ్ చేశారు. అతనితో పాటు గోవా పీసీసీ చీఫ్ గిరీశ్ ఛొడంకర్ ఉన్నారు.