మార్పు జరిగితే అది బీహార్ నుంచే మొదలవుతుంది: రాహుల్

మార్పు జరిగితే అది  బీహార్ నుంచే మొదలవుతుంది: రాహుల్

దేశంలో ఎప్పుడు మార్పు జరిగినా అది బీహార్ నుంచే ప్రారంభం అవుతుందన్నారు రాహుల్ గాంధీ. బీహార్ లో జన్ విశ్వాస్ యాత్రలో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. బీహార్ రాజకీయ నాడి..దేశానికి కేంద్రమన్నారు. దేశంలో సైద్ధాంతిక యుద్ధం నడుస్తోందన్న రాహుల్.. ఓ వైపు ద్వేషం, హింస, అహంకారం..మరోవైపు ప్రేమ,  గౌరవం పోటీ పడుతున్నాయన్నారు. 

ఇండియా కూటమిని ఒక్క వ్యాక్యంలో తెలుసుకోవచ్చని.. విద్వేషాల బజార్ లో ప్రేమ దుకాణం తెరిచేందుకు తామంతా బయల్దేరామన్నారు రాహుల్.