
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కొత్త ఇంటికి మారబోతున్నట్టు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ బీ2 పరిసర ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆఖరి రోజుల్లో గడిపిన ఇల్లే ఇక... రాహుల్ గాంధీ ఇంటి అడ్రస్ గా మారనుందంటూ వార్తలు వస్తున్నాయి . ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను విడిచిపెట్టిన కొన్ని నెలల తర్వాత తాజాగా ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఏప్రిల్ 22న లోక్సభ నుంచి అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను విడిచిపెట్టి తాత్కాలికంగా తన తల్లి వద్దకు వెళ్లిపోయారు. అప్పట్నుంచి కొత్త ఇంటి కోసం వెతుకుతున్న రాహుల్ గాంధీ.. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ ఇల్లు16వ శతాబ్దపు మొఘల్ సమాధి అయిన పచ్చని హుమాయున్ సమాధిపై కనిపించే 15వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఢిల్లీలోని తుగ్లక్ లేన్లోని గాంధీ 19 ఏళ్ల నాటి పెద్ద లుటియన్స్ బంగ్లాకు ఇది భిన్నంగా ఉంటుంది.
13వ శతాబ్దపు సూఫీ సన్యాసి ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా దర్గా ఇంటికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఈ ఇల్లు ఉంది. డిసెంబరు చివరి వారంలో రాహుల్ గాంధీ ఢిల్లీకి వచ్చినప్పుడు, దర్గాలో ప్రార్థనలు చేసిన విషయం తెలిసిందే.
3BHK ఫ్లాట్ ఆమెదే..
1991లో దీక్షిత్ నిజాముద్దీన్ ఈస్ట్లో ఇంటిని కొనుగోలు చేశారు. ఆమె 1998 నుంచి 2013 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014లో ఆమె కేరళ గవర్నర్గా ఉన్నారు. NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఆ పదవిని వదులుకున్నారు. కేరళ గవర్నర్గా పనిచేసిన తర్వాత, షీలా దీక్షిత్ నిజాముద్దీన్ ఈస్ట్ హౌస్లోకి మారారు. ఆమె మరణించే వరకు అక్కడే ఉన్నారు.