లోక్ సభలో చొరబాటుకు నిరుద్యోగమే కారణం:రాహుల్

లోక్ సభలో చొరబాటుకు నిరుద్యోగమే కారణం:రాహుల్

న్యూఢిల్లీ  : పార్లమెంట్​లో భద్రతా వైఫల్యం వల్లే ఇటీవల లోక్ సభలోకి ఇద్దరు యువకులు చొరబడి స్మోక్ అటాక్ చేశారని..  ఈ చొరబాటుకు నిరుద్యోగమే అసలు కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ పాలసీల వల్లే దేశంలో యువతకు ఉద్యోగాలు రావట్లేదన్నారు. శనివారం ఢిల్లీలో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో ప్రస్తుతం నిరుద్యోగమే అతిపెద్ద సమస్యగా మారింది. 

ప్రధాని మోదీ విధానాల కారణంగా యువతకు ఉద్యోగాలు లేక దేశమంతా అట్టుడుకుతోంది” అని చెప్పారు. రాహుల్ గాంధీ కామెంట్లపై బీజేపీ ఐటీ ఇంచార్జ్ అమిత్ మాలవీయ ఫైర్ అయ్యారు. దేశంలో నిరుద్యోగిత రేటు గత ఆరేండ్లలో అతితక్కువగా 3.2 శాతానికి తగ్గిపోయిందన్నారు. పార్లమెంట్ లోకి చొరబడి స్మోక్ అటాక్ చేసిన యువకులకు కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండటంపై ముందుగా ఇండియా కూటమి నేతలు స్పందించాలన్నారు.