హైదరాబాద్, వెలుగు: రాహుల్గాంధీ టూర్లో మార్పులు జరిగాయి. ఆయన అనివార్య కారణాలతో శుక్రవారం టూర్లో కొన్ని పర్యటనలు రద్దు చేసుకున్నారు. పాత షెడ్యూల్ ప్రకారం బోధన్, నిజామాబాద్ లో రాహుల్ పర్యటించాల్సి ఉండగా.. ఆ రెండు పర్యటనలు రద్దయ్యాయి. బోధన్లో బీడీ కార్మికులు, షుగర్ఫ్యాక్టరీ కార్మికులు, గల్ఫ్కార్మికులతో సమావేశమై అనంతరం షుగర్ఫ్యాక్టరీని సందర్శించాల్సి ఉంది. ఆ తర్వాత ఆర్మూర్కు వెళ్లాల్సి ఉంది. కానీ, బోధన్ టూర్లేకుండా నేరుగా ఆర్మూర్కు వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత నిజామాబాద్కు వెళ్లి పాదయాత్ర చేసి పసుపు రైతులతో సమావేశం కావాల్సి ఉండగా, దాన్ని క్సాన్సిల్చేసుకున్నారు. ఢిల్లీలో అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్లే రాహుల్ పర్యటనలో మార్పులు జరిగాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ రివైజ్డ్ షెడ్యూల్..
శుక్రవారం ఉదయం 9గంటలకు చొప్పదండి నియోజకవర్గం గంగాధర వద్ద సమావేశంలో రాహుల్పాల్గొంటారు. 9:30 గంటలకు కొండగట్టు వెళ్లి అంజన్నను దర్శించుకుంటారు. 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్మీటింగ్లో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, ఒంటిగంటకు కోరుట్లలో నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం 2:30 గంటలకు ఆర్మూర్బహిరంగ సభలో పాల్గొని ఢిల్లీకి వెళ్తారు.