పొగిడే వాళ్లనే ఇష్టపడతారు.. రాహుల్ టార్గెట్ గా మోదీ చురకలు

పొగిడే వాళ్లనే ఇష్టపడతారు.. రాహుల్ టార్గెట్ గా మోదీ చురకలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ కుటుంబానికి చెందిన యువరాజు యూపీ యువతను మద్యం బానిసలు అన్నారని ఆ కుటుంబం ఓటు బ్యాంకును తప్ప ఏమి చూడదని ఆరోపించారు. వారసత్వంగా వచ్చి ఆ వ్యక్తి దేశంలోని సామాన్య ప్రజలకు ప్రమాదకారని విమర్శించారు. వారణాసిలో యువత మద్యం తాగి రోడ్డు మీద పడి ఉ‍న్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యల పై మోదీ పరోక్షంగా స్పందించారు. 

వాళ్లు కేవలం తమను పొగిడే వాళ్లనే ఇష్టపడతారని మిగిలిన వారిని రామ మందిరం ప్రారంభోత్సవం జరిగినప్పటి నుంచి  యూపీ ప్రజలను ఇష్టపడటం లేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు రాముడిపై అంత ద్వేషం పెంచుకుంటుందో అర్థం కావడం లేదని అన్నారు. 

ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌ అభివృద్ధి చెందుతోందని మోదీ తెలిపారు. ఇండియా కూటమి యూపీ యువతను అవమానించిన తీరును ఎవరూ మర్చిపోరని మోదీ అన్నారు. వారణాసి యువతపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మోదీ అన్నారు.