మోడీజీ.. ఖర్చులపై చర్చ జరపండి

మోడీజీ.. ఖర్చులపై చర్చ జరపండి

న్యూఢిల్లీ: పెట్రో ధరలపై ప్రధాని మోడీని టార్గెట్ చేసుకుంటూ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు దేశీ మార్కెట్లో ఎక్కువగా ఉండటానికి కారణమేంటని రాహుల్ ప్రశ్నించారు. ప్రభుత్వ పన్నుల వల్ల వాహనాల్లో పెట్రోల్ పోయించడమో పరీక్షలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి మోడీ ఎందుకు చర్చించరని క్వశ్చన్ చేశారు. ఖర్చుల మీద కూడా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.