
రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్ ఇన్చార్జి తహసీల్దార్ మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మంగళవారం ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఎండీ ముజాఫర్ నుంచి ఇన్చార్జితహసీల్దార్ జటంగుల గణేశ్రూ.10 వేలు పట్టుకున్నట్లు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ తెలిపారు. మండలంలోని సింగరావుపేట గ్రామ శివారులోని ఎకరం రెండున్నర గుంటల భూమిని గ్రామానికి చెందిన రవి ఇతరులకు అమ్మాడు.
ఆ భూమిలో కొంత భూమి కెనాల్కు వెళ్తుందని రిజిస్ట్రేషన్కు అభ్యంతరం చెప్పిన ఇన్చార్జి తహసీల్దార్ రూ.15 వేలు ఇస్తే క్లియర్ చేస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ద్వారా రూ.10 వేలు ఇచ్చేందుకు అంగీకరించి, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చుతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.