ఏసీబీ వలలో రాయికల్ ఇన్‌‌చార్జి తహసీల్దార్..రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టివేత

ఏసీబీ వలలో రాయికల్ ఇన్‌‌చార్జి తహసీల్దార్..రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టివేత

రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్​ ఇన్‌‌చార్జి తహసీల్దార్​ మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా కరీంనగర్​ ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. మంగళవారం ప్రైవేట్​ డాక్యుమెంట్​ రైటర్​ ఎండీ ముజాఫర్​ నుంచి ఇన్​చార్జి​తహసీల్దార్​ జటంగుల గణేశ్​​రూ.10 వేలు పట్టుకున్నట్లు కరీంనగర్​ ఏసీబీ డీఎస్పీ విజయ్​కుమార్​ తెలిపారు. మండలంలోని సింగరావుపేట గ్రామ శివారులోని ఎకరం రెండున్నర గుంటల భూమిని గ్రామానికి చెందిన రవి ఇతరులకు అమ్మాడు.

ఆ భూమిలో కొంత భూమి కెనాల్​కు వెళ్తుందని రిజిస్ట్రేషన్​కు అభ్యంతరం చెప్పిన ఇన్​చార్జి తహసీల్దార్  రూ.15 వేలు ఇస్తే క్లియర్​ చేస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ప్రైవేట్​ డాక్యుమెంట్​ రైటర్​ ద్వారా రూ.10 వేలు ఇచ్చేందుకు అంగీకరించి, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చుతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.