కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వేజోన్ అంశం ఓ కొలిక్కి వచ్చింది. విశాఖకు రైల్వేజోన్ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేశారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 13 ఎనిమిదో ఆర్టికల్ ప్రకారం విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను ఏర్పాటు చేయనున్నారు.
విజయవాడ, గుంటూరు, గుంతకల్, వాల్తేరులో ఒక భాగంతో కలిపి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. వాల్తేరును రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని మాత్రమే విశాఖ జోన్లో కలపనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 1న విశాఖలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది.