వర్షం కారణంగా పరేడ్ గ్రౌండ్స్లో కేసీఆర్ సభ రద్దు

వర్షం కారణంగా పరేడ్ గ్రౌండ్స్లో కేసీఆర్ సభ రద్దు

ఎన్నికల ప్రచార సభలకు వర్షం అడ్డంకిగా మారింది. రేపు(నవంబర్ 25) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ రద్దైంది. వాతావరణం సహకరించకపోవడంతోనే సభ రద్దు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

అయితే సభ రద్దుపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్స్ లో సభ కోసం బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సిటీతో పాటు... చుట్టు పక్కన జిల్లాల నుంచి పెద్దఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేశారు నేతలు.