ఈశాన్య రుతుపవనాలు నిన్న(బుధవారం) తమిళనాడులోకి ప్రవేశించాయి. రుతుపవనాల ప్రభావంతో చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చెన్నై నగరం వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్డుపై మోకాల్లలోతు నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా ఏరియాల్లో వాహనాలు నీట మునిగాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. ఇవాళ కూడా చెన్నైలో భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది వాతావరణశాఖ.
Tamil Nadu: Rain lashes parts of Chennai; water enters residential areas.
India Meteorological Department (IMD) predicted 'generally cloudy sky with heavy rain' in the city today. pic.twitter.com/bv3SsYw5c2
— ANI (@ANI) October 29, 2020