రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం ‘తిరగబడర సామీ’. శుక్రవారం ఈ మూవీ టీమ్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 23న వరల్డ్వైడ్గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
యూత్ను ఆకట్టుకునే రొమాన్స్తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్తో రూపొందించామని దర్శక నిర్మాతలు చెప్పారు. మన్నారా చోప్రా మరో హీరోయిన్గా నటించగా, మకరంద్ దేశ్పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృథ్వీ, ప్రగతి, రాజా రవీంద్ర ఇతర పాత్రలు పోషించారు. భాష్యశ్రీ ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తుండగా, జేబీ సంగీతం అందిస్తున్నాడు.