TRS ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు బయటకు రావొద్దు

TRS ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు బయటకు రావొద్దు

హైదరాబాద్ లో  భారీగా వర్షాలు కురుస్తున్నాయని...ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. టీఆర్ఎస్ పార్టీ పాల్తూ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు బయటకు రావొద్దని..ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.

వేస్ట్ GHMC ఉందని..అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజాసింగ్. GHMC అభివృద్ధికి 67 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. విశ్వనగరం,డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్నారు..కానీ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. వర్షం వస్తె నాళాలు అన్ని పొంగిపొర్లడంతో పాటు.. రోడ్లపై ఎక్కడ గుంతలు ఉన్నాయో అర్థం కావడం లేదన్నారు. హైదరాబాదులో వర్షం వచ్చినప్పుడు..కేటీఆర్ బండిపై తిరిగితే వాస్తవం తెలుస్తుందన్నారు. 67 వేల కోట్లు  ఎక్కడ ఖర్చు పెట్టారో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.