వేర్‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా రజని బాధ్యతలు

వేర్‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా రజని బాధ్యతలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: వేర్‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా వేద రజని గురు వారం బాధ్యతలు స్వీకరించారు. హైదరా బాద్‌‌‌‌‌‌‌‌ నాంపల్లిలోని రాష్ట్ర వేర్‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్​లో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రోగ్రామ్​కు మంత్రులు నిరంజన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. వేర్‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ సాయిచంద్‌‌‌‌‌‌‌‌ ఇటీవల హార్ట్‌‌‌‌‌‌‌‌ ఎటాక్‌‌‌‌‌‌‌‌తో చనిపోయారు. దీంతో సాయిచంద్‌‌‌‌‌‌‌‌ స్థానంలో ఆయన భార్య రజనిని చైర్మన్‌‌‌‌‌‌‌‌గా నియమిస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు రజని కృతజ్ఞతలు తెలిపారు.