Sharwanand: శర్వానంద్ తండ్రిగా టాలీవుడ్ స్టార్ హీరో!

Sharwanand: శర్వానంద్ తండ్రిగా టాలీవుడ్ స్టార్ హీరో!

టాలీవుడ్‌లో టాలెంటెడ్ యాక్టర్స్ లలో శర్వానంద్ (Sharwanand) ఒకరు. చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న ఈ యంగ్ హీరో..సైలెంట్గా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం శర్వా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న బేబీ ఆన్ బోర్డు అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఈ మధ్యన కంప్లీట్ చేసుకుంది. 

లేటెస్ట్గా శర్వా మరో మూవీని స్టార్ట్ చేసేశాడు. లూజర్ వెబ్ సీరీస్తో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డి(Abilashreddy)తో తన నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుపుకుంది.అంతేకాదు..అపుడే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నుంచి ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

అదేంటంటే..ఈ సినిమాలో శర్వానంద్ తండ్రిగా..ఒకప్పటి స్టార్ హీరో నటిస్తున్నట్లు సమాచారం. ఆయన ఇంకెవరో కాదు, యాంగ్రీ యంగ్ మాన్గా టాలీవుడ్లో స్టార్ హీరోలో ఒకరైన రాజశేఖర్ (Rajasekhar) ఈ సినిమాలో తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్ను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.

ఈ సినిమాలో హీరో రాజశేఖర్ పాత్ర..కథలో మలుపు తిప్పబోతుందని..తండ్రికి కొడుకుకి మధ్య జరిగే బలమైన సీన్స్ కూడా చాలానే ఉంటాయనే సమాచారం. అందుకే, ఈ సినిమాలో నటించడానికి రాజశేఖర్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 

ఇక రీసెంట్గా నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే, అది అద్భుతమైన పాత్ర అని..ఎక్స్‌ట్రా మేకర్స్ ముందు నుంచి ప్రచారం చేసిన..చివరికి సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే..రాజశేఖర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో చాలా విమర్శలు వచ్చాయి. ఇపుడు శర్వా సినిమాలో అలాంటి తప్పు జరగదని సినిమా యూనిట్ నుంచి సమాచారం.ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ నటిస్తుంది 

మహా సముద్రం,ఆడవాళ్ళు మీకు జోహార్లు కమర్షియల్గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఒకే ఒక జీవితం సినిమా మాత్రం పర్వాలేదనిపించింది.అయితే, శతమానం భవతి, మహానుభావుడు వంటి సినిమాల తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ను ఇప్పటి వరకు శర్వానంద్ అందుకోలేకపోయారు.ఇపుడు లేటెస్ట్గా రాబోయే మూవీస్ తో అయిన సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.