గెహ్లాట్‌కు బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు.. వచ్చేవారం ఫ్లోర్‌‌ టెస్ట్‌

గెహ్లాట్‌కు బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు.. వచ్చేవారం ఫ్లోర్‌‌ టెస్ట్‌
  • గవర్నర్‌‌ను కలిసిన గెహ్లాట్‌

జైపూర్‌‌: రాజస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. పరిస్థితుల్లో రోజుకో మార్పు చోటు చేసుకుంటోంది. 18 మంది కాంగ్రెస్‌ రెబల్స్‌ మద్దతు లేకపోవడంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ తన బలాన్ని కోల్పోయింది. దీంతో వచ్చేవారం బలపరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం అశోక్‌ గెహ్లాట్‌ ఈ మేరకు గవర్నర్‌‌ను కలిశారని తెలుస్తోంది. బీటీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అశోక్‌ గెహ్లాట్‌కు మద్దతు ఇవ్వడంతో గెహ్లాట్‌ గవర్నర్‌‌ను కలిశారని చెప్పారు. బలాల సమీకరణకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్న టైంలో బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు గెహ్లాట్‌కు ఊరట కలిగించనుంది. అసెంబ్లీలో బల పరీక్ష జరిగితే తమ పార్టీ దూరంగా ఉంటుందని ఇటీవల ప్రకటించిన బీటీపీ అన్యూహ్యంగా గెహ్లాట్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. సీఎం గెహ్లాట్‌ నివాసంలో జరిగిన సీఎల్పీ భేటీ సందర్భంగా కాంగ్రెస్‌కు తమ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు కొన్ని డిమాండ్లు కూడా చేసినట్లు తెలుస్తోంది. మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌తో పాటు 18 మందికాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం పడిపోయిన విషయం తెలిసిందే.