సచిన్ పైలట్ సీఎం కాకుండా అడ్డుకుంటున్న అశోక్ గెహ్లాట్ వర్గం

సచిన్ పైలట్ సీఎం కాకుండా అడ్డుకుంటున్న అశోక్ గెహ్లాట్ వర్గం

రాజస్థాన్ లో రాజకీయ హైడ్రామా నడుస్తోంది. రాజస్థాన్ లో తర్వాత సీఎం ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. అశోక్ గెహ్లాట్ సీఎంగా ఉండాలని చాలామంది ఎమ్మెల్యేలు కోరుతున్నారు. సచిన్ పైలట్ కు సీఎం పదవి అప్పగిస్తే 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తే  ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. 

92 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కాంగ్రెస్ బలం 55 కి పడిపోనుంది. బీజేపీకి 70 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ప్రభుత్వం కూలిపోతుందంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సచిన్ పైలట్ సీఎం కాకుండా అశోక్ గెహ్లాట్ వర్గం అడ్డుకుంటోంది.