దీపావళి వేళ రాజస్థాన్ లోని అల్వార్కు చెందిన యూట్యూబర్ అమిత్ శర్మ చేసిన పని అందరినీ విస్తుపోయేలా చేసింది. అతడు చేసిన పనేంటో చెబితే మైండ్ బ్లాంక్ అవుతుంది. అతడు తన కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు ముందున్న గ్లాస్పై మాత్రం టపాసులు పెట్టలేదు. అనంతరం 1.. 2.. లెక్కపెట్టి.. 3 అనగానే బాంబులను పేల్చాడు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా బాంబుల శబ్దంతో మారుమోగిపోయింది. బాంబులు పేలడంతో కారు కలర్ మారిపోయింది. కారు లోపల పొగ నిండిపోయి ఉంది.
కారు అద్దంపై బాంబులు లేకపోయినప్పటికీ పేలిన టపాసుల ధాటికి గ్లాస్ మెత్తబడిపోయి పగిలిపోయింది. ఇన్ని బాంబులు పేలినా కారు ఇంజన్ పనిచేయడం విశేషం. కొద్దిసేపటి తర్వాత యూట్యూబర్ మళ్లీ కారును స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తూ తన దోస్తులతో ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదేం తిక్కరా నాయనా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.