
సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు శ్యామ్ సెల్వన్ను హీరోగా పరిచయం చేస్తూ... రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘నిమ్మకూరు మాస్టారు’. అముదేశ్వర్ దర్శకత్వంలో జె.ఎమ్.ప్రదీప్ రెడ్డి నిర్మిస్తున్నాడు. మాధవపెద్ది సురేష్ చంద్ర సంగీతం అందిస్తుండగా, చిత్రంలోని అన్ని పాటలకు జొన్నవిత్తుల సాహిత్యం సమకూరుస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. రాజేంద్ర ప్రసాద్ సహా మూవీ టీమ్ అంతా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి టీమ్కు బెస్ట్ విషెస్ తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్తో స్క్రీన్ షేర్ చేసుకోనుండటం ఎంతో ఎక్సయిటింగ్గా ఉందని హీరో శ్యామ్ సెల్వన్ అన్నాడు. ఈనెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని దర్శక నిర్మాతలు చెప్పారు.