పొదెం వీరయ్య యువసేన ఆధ్వర్యంలో రాజీవ్​గాంధీ క్రికెట్ టోర్నీ ప్రారంభం

పొదెం వీరయ్య యువసేన ఆధ్వర్యంలో రాజీవ్​గాంధీ క్రికెట్ టోర్నీ ప్రారంభం

భద్రాచలం, వెలుగు :  డీసీసీ ప్రెసిడెంట్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య యువసేన పేరిట భద్రాచలంలోని జూనియర్​ కాలేజీ గ్రౌండ్​లో ఆదివారం రాజీవ్​గాంధీ అంతరాష్ట్ర క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. ఈ టోర్నీని మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య బ్యాటింగ్​ చేసి ప్రారంభించారు. 

టోర్నమెంట్​లో మొత్తం 40 జట్లు పాల్గొంటున్నాయని పొదెం వీరయ్య యువసేన​ అధ్యక్షుడు తెల్లం నరేశ్​ తెలిపారు. ఈనెల 13 వరకు పోటీలు జరుగుతాయని చెప్పారు. విజేతకు రూ.50వేలు, రన్నర్​కు రూ.25వేలు ఇస్తామని వెల్లడించారు.