= వీడియో రిలీజ్ చేసిన రక్షణ మంత్రి ఆఫీస్
న్యూఢిల్లీ: రెండు రోజుల లడాఖ్ టూర్లో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ గాల్వాన్ వ్యాలీలో చైనాతో వీరోచితంగా పోరాడిన బీహార్ రెజింమెంట్ సైనికులతో భేటీ అయ్యారు. రాజ్నాథ్సింగ్ సైనికులతో మాట్లాడుతున్న వీడియోను రక్షణ మంత్రి కార్యాలయం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సైనికులతో మాట్లాడిన రాజ్నాథ్సింగ్ వాళ్లకు షెకాండ్ ఇచ్చి సైనికులను మెచ్చుకున్నారు. ఇండియా – చైనా బోర్డర్లోని గాల్వాన్ లోయ దగ్గర మన సైనికులు, చైనా మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో బీహార్ రెజిమెంట్కు చెందిన సైనికులు వీరోచితంగా పోరాడారు. ఈ గొడవలో బీహార్ రెజిమెంట్కు చెందిన 20 మంది చనిపోయారు. కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్బాబు కూడా అశువులు బాసిన విషయం తెలిసిందే.
Raksha Mantri Shri @rajnathsingh met the soldiers from Bihar Regiment at Lukung during his visit to forward areas in Ladakh. He had a brief interaction with them. pic.twitter.com/81YS0T960a
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) July 19, 2020