బీహార్‌‌ రెజిమెంట్‌ సైనికులతో ముచ్చటించిన రాజ్‌నాథ్‌

బీహార్‌‌ రెజిమెంట్‌ సైనికులతో ముచ్చటించిన రాజ్‌నాథ్‌

= వీడియో రిలీజ్‌ చేసిన రక్షణ మంత్రి ఆఫీస్‌
న్యూఢిల్లీ: రెండు రోజుల లడాఖ్‌ టూర్‌‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గాల్వాన్‌ వ్యాలీలో చైనాతో వీరోచితంగా పోరాడిన బీహార్‌‌ రెజింమెంట్‌ సైనికులతో భేటీ అయ్యారు. రాజ్‌నాథ్‌సింగ్‌ సైనికులతో మాట్లాడుతున్న వీడియోను రక్షణ మంత్రి కార్యాలయం ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో సైనికులతో మాట్లాడిన రాజ్‌నాథ్‌సింగ్‌ వాళ్లకు షెకాండ్‌ ఇచ్చి సైనికులను మెచ్చుకున్నారు. ఇండియా – చైనా బోర్డర్‌‌లోని గాల్వాన్‌ లోయ దగ్గర మన సైనికులు, చైనా మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో బీహార్‌‌ రెజిమెంట్‌కు చెందిన సైనికులు వీరోచితంగా పోరాడారు. ఈ గొడవలో బీహార్‌‌ రెజిమెంట్‌కు చెందిన 20 మంది చనిపోయారు. కమాండింగ్ ఆఫీసర్‌‌ కల్నల్‌ సంతోష్‌బాబు కూడా అశువులు బాసిన విషయం తెలిసిందే.