హైదరాబాద్, వెలుగు: రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్సోమవారం రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్మీ హెలిక్యాప్టర్లో బయల్దేరి మధ్యాహ్నం 12.50 గంటలకు హుజూరాబాద్కు వెళ్తారు.
అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.30కు హుజూరాబాద్నుంచి బయల్దేరి 3.10 గంటలకు శంషాబాద్ఎయిర్పోర్టుకు వస్తారు. మహేశ్వరంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. సాయంత్రం 5.40 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి తిరిగి బయల్దేరుతారు.