కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి. కరీంనగర్ సీపీ ఖాకీ కాదన్నారు. ఆయన పింకీ పోలీస్ అని ఆరోపించిన రాకేశ్ రెడ్డి.. పింక్ కలర్ దుస్తులు, చెప్పులు, కండువా పంపిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పోలీసుల అహంకారం దించేలా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న పోలీసులను తాము అధికారంలోకి వచ్చాక తొలగించడం ఖాయమన్నారు రాకేశ్ రెడ్డి. రాష్ట్రంలోని యువత కూడా కరీంనగర్ సీపీకి పింక్ కలర్ బట్టలు కొరియర్ చేయాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్ సీపీ ఖాకీ కాదు. పిపి. అంటే పింకీ పోలీస్. నేను పంపే ఈ పింక్ బట్టలు వేసుకొని ఫార్మ్ హౌస్ కి పేరంటానికి వెళ్ళండి, ప్రదక్షిణలు చేయండి.
— Rakesh Reddy Anugula (@rakeshreddybjp) January 4, 2022
యువతను కోరుతున్నా. మీరు కూడా పింక్ బట్టలను కొరియర్ చేయండి. అట్లనైనా సిగ్గొస్తది ఆ పింకీ పోలీస్ కి.#releasebandisanjay #pinkypolice pic.twitter.com/K9wfFaRhTx