Upasana,Kiara: తల్లి కాబోతున్న కియారా అద్వానీకి.. నోరూరించే బహుమతి పంపిన ఉపాసన

Upasana,Kiara: తల్లి కాబోతున్న కియారా అద్వానీకి.. నోరూరించే బహుమతి పంపిన ఉపాసన

బాలీవుడ్​ బ్యూటీ కియారా అద్వానీ మరికొన్ని రోజుల్లో తన మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ భార్య ఉపాసన.. కియారకు స్పెషల్ గిఫ్ట్ పంపింది. ప‌చ్చి మామిడితో చేసిన‌ నోరూరించే ఊర‌గాయ ప‌చ్చడిని బహుమతిగా ఇచ్చింది. లైవ్ లీగా తినేందుకు, పులుపును ఆస్వాధించేందుకు గ‌ర్భిణి కియ‌రా కోసం ఈ స్పెషల్ పికిల్ అందజేసింది.

"ప్రియమైన కియారా, నా అత్తమ్మ (అత్తగారు) నుండి, ప్రేమతో. మా మామిడికాయ ఊరగాయ యొక్క ప్రత్యేక రుచిని ఆస్వాదించండి. ప్రేమతో తయారు చేయబడింది, మా వంటగది నుండి నేరుగా.. మీ వరకు వచ్చింది. దీన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ప్రేమతో" అని కియ‌రాను ఉపాస‌న కోరారు.

కియారా తన ఉత్సాహాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తనకు అందిన ప్యాకేజీ ఫోటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా రామ్ చరణ్-ఉపాసనలకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

ఉపాసన తన అత్తమ్మ కొణిదెల సురేఖకి 'అత్తమ్మాస్ కిచెన్' కి  సంబందించిన పికిల్స్, కుకింగ్ రెసిపీస్ గిట్స్ ను.. సెలబ్రెటీలకు పంపిస్తుంటుంది. ఇటీవలే పెద్ది సెట్ లో జాయిన్ ఐన జాన్వీకపూర్ కి కూడా పంపింది. ఇక ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న కియారకు నోరూరించే ఊర‌గాయ ప‌చ్చడి పంపడంతో మెగా లేడీ ఫ్యాన్స్.. ఫోటోలు షేర్ చేస్తున్నారు. 

ఇకపోతే.. కియారా అద్వానీ హీరో సిద్ధార్థ్​ మల్హోత్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2025 ఫిబ్రవరి నెలలో తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రకటన చేసింది. ఇటీవలే మెట్ గాలా 2025 ఈవెంట్ లో బేబీ బంప్ తో మెరిసింది. 

కియారా సినీ విషయానికి వస్తే.. 2025 జూన్ 13న సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కియార తన నెక్స్ట్ మూవీ వార్ 2 రిలీజ్ కు రెడీగ ఉంది.  హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి కనిపించనుంది. కియారా తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాలో మెరిసింది.