
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన పేరు. ఆ పేరు వెనుకాల ఉండే విజన్ చాలా అరుదు. లేటెస్ట్ గా RGV డైరెక్షన్ లో రాబోతున్న చిత్రం వ్యూహం(Vyuham) అని తెలిసిందే. ఇవాళ (ఆగస్టు13న) ఆదివారం విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు.
వ్యూహం మూవీలో..జగన్ మీద ఒపీనియన్ ను, జగన్ లో ఉన్న రియాలిటీని చూపించడం మాత్రమే నా ఉద్దేశ్యమని RGV తెలిపారు. నేను నమ్మినా నిజాలను మాత్రమే చూపిస్తానని..అదేంటనేది సినిమాలో మాత్రమే చూడాలని పేర్కోన్నారు. కాగా ఈ మూవీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం దగ్గర నుంచి..మూవీ స్టార్ట్ అవ్వునుందని..అంతేకాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి కూడా ఈ మూవీలో టచ్ చేసినట్టు స్పష్టం చేశారు.
ప్రతీ ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని బహిర్గతం చేసే హక్కు ఉందని అలాగే తాను నమ్మిన నిజాన్ని, అభిప్రాయాన్ని సినిమాగా తీసి విడుదల చేస్తామని తెలిపారు. అలాగే వ్యూహం,శపథం మూవీస్ 2024 ఎలక్షన్స్ కంటే ముందుగానే రాబోతున్నట్టు చెప్పారు. ఇప్పటికే 70 పర్సెంట్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలిపారు.
నిజానికి సీఎం జగన్ అంటే ఎంతో ఇష్టమని ప్రకటించారు.కావాలని మెగా ఫ్యామిలీపై విమర్శలు చేయనని,కేవలం ప్రతిపక్షంలో ఉన్న పవన్ కల్యాణ్ గురించి మాత్రమే స్పందిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు సినీ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్పై వివాదం కరెక్ట్ కాదనేది తన ఫీలింగ్ అని తెలిపారు. విమర్శలంటేనే తనకి ఇష్టమని..పొగడ్తలు బోర్ కొడుతాయని వర్మ వివరించారు. ఇక రీసెంట్ గా చిరంజీవి చేసిన కామెంట్స్ ఎవరిపైనా అనేది కరెక్ట్ గా తెలియదన్నారు.