విష్ణువర్ధన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేయొద్దు : రమాదేవి 

విష్ణువర్ధన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేయొద్దు : రమాదేవి 

షాద్​నగర్, వెలుగు:  సోషల్ మీడియాలో షాద్ నగర్ ఆలిండియా ఫార్వర్డ్‌‌‌‌ బ్లాక్ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయొద్దని ఆయన భార్య రమాదేవి విజ్ఞప్తి చేశారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో ఉండగా.. అభిమానులు ఆందోళనలో కావాలనే కొందరు విషం చిమ్మేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం షాద్ నగర్ టౌన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేస్తుండగా గుండె నొప్పి రావడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఆస్పత్రిలో చేరిచికిత్స పొందుతుండగా.. బీజేపీ కార్యకర్తలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.  ప్రజలకు సేవ చేయడం ఆయన చేసిన తప్పా అని ప్రశ్నించారు.  బీజేపీ పార్టీకి ఎంతో సేవ చేసినా కావాలనే ఆయనకు టిక్కెట్‌‌‌‌ ఇవ్వలేదన్నారు.   అనారోగ్యం పేరిట నాటకాలు ఆడాల్సిన అవసరం తమకు లేదని, గుండెకు స్టంట్ వేయాలని డాక్టర్ చెప్పారని ఆమె స్పష్టంచేశారు.  ఈ సమావేశంలో విజయ్ భాస్కర్ రెడ్డి, ఆకుల ప్రదీప్, పాండు రంగారెడ్డి పాల్గొన్నారు.