రైతును రాజుగా చేయడమే బీజేపీ లక్ష్యం: రాంచందర్ రావు

రైతును రాజుగా చేయడమే బీజేపీ లక్ష్యం: రాంచందర్ రావు

వనపర్తి, వెలుగు: దేశానికి అన్నం  పెట్టే రైతులను రాజుగా చేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని  మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. గురువారం వనపర్తిలో గురువారం పీఎం మోదీ  కిసాన్ సమృద్ధి సేవా కేంద్రాల ప్రారంభోత్సవాన్ని నాయకులు వీక్షించారు.  అనంతరం గ్రోమోర్ రైతు సేవా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి,  సబిరెడ్డి వెంకట్ రెడ్డి, జింకల కృష్ణయ్య, మాధవరెడ్డి,  సుమిత్రమ్మ,   అనుజ్ఞారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :డాక్టర్స్ కాలనీలో వైద్యారోగ్యశాఖ తనిఖీలు


మరికల్​, వెలుగు : రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే స్కీంల గూర్చి గురువారం మండల కేంద్రంలోని జై కిసాన్​ ఫర్టిలైజర్​ షాపులో ప్రొజెక్టర్​ ద్వారా అవగాహన కల్పించారు.   కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్​రెడ్డి, వేణు, నరేశ్​గౌడ్​, వెంకటే​శ్​, రమేశ్, రైతులు పాల్గొన్నారు.