ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె

ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె
  • రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తున్నరు

ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీచీఫ్ రాహుల్ గాంధీ పదేపదే ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని  కేంద్రమంత్రి ,రిపబ్లికన్​  పార్టీ ఆఫ్​ ఇండియా జాతీయ అధ్యక్షుడు రాందాస్​ అథవాలె అన్నారు. సోమావారం ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. " కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు..రాజ్యాంగాన్ని మారుస్తారంటూ అసత్య ఆరోపణలు చేయడం రాహుల్​ మానుకోవాలి. 

రిజర్వేషన్లు తీసేయడంకాదు... ఇంకా పెంచుతారు. రిజర్వేషన్లు తీసేస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానా? కేంద్ర ప్రభుత్వం సోలార్​ విద్యుత్​ ద్వారా 20 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. 4 కోట్ల ప్రజలకు మరుగు దొడ్ల సదుపాయం కల్పించింది. ప్రధాని ఆవాస్​ యోజన ద్వారా 30 కోట్ల  మందికి గృహాలు మంజూరయ్యాయి. 60 కోట్లమందికి 3 ఏండ్లుగా  ఉచిత బియ్యం పంపిణీ అవుతున్నది. 

జాతీయ రహదారులను అభివృద్ధి పరిచాం. రైల్వే కనెక్టివిటీని పెంచాం. మరోసారి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తం. తెలంగాణలోని ఎంపీ అభ్యర్థులతోపాటు ఏపీలో బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించండి" అని రాందాస్​ అథవాలె పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ ఏపీ అధ్యక్షుడు కె.బ్రహ్మనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.