అనస్థీషియా డాక్టర్ల .. అధ్యక్షుడిగా రమేశ్​

అనస్థీషియా డాక్టర్ల .. అధ్యక్షుడిగా రమేశ్​

ఆర్మూర్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అనస్థీషియా (ఐఎస్ఏ) డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్మూర్​ కు చెందిన డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ వో డాక్టర్ రమేశ్​ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లో సంఘం ఎన్నికలు జరిగాయి. డాక్టర్​ మహేశ్​కుమార్ సిన్హా ఎలక్షన్ అబ్జర్వర్ గా, డాక్టర్​ వీరేశం ఆఫీసర్ గా నిర్వహించిన ఈ ఎలక్షన్స్​లో రమేశ్​ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన వంతు బాధ్యతగా అందరికీ ఉపయోగపడేలా కార్యక్రమాలు చేపడతానన్నారు. 

డాక్టర్​రమేశ్​ను ఆర్మూర్ లో జరిగిన అభినందన సభలో జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్​ డాక్టర్​అశోక్, డాక్టర్​ రుద్ర శ్రీనివాస్  ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్​సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి, సీహెచ్ వో కృష్ణ మూర్తి, ఆండ్రోస్, సంపత్ పాల్గొన్నారు.