కామారెడ్డి టౌన్, వెలుగు: ఒడిశా నుంచి మహారాష్ట్రకు రైలులో తరలిస్తున్న 20 కిలోల ఎండు గంజాయిని కామారెడ్డి జిల్లా ఎక్సైజ్పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్హన్మంత్ రావు వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో శనివారం ఒడిశాలోని సంబల్పూర్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్కు వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్లో ఎక్సైజ్, రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఎస్7 బోగీలో బెర్తు కింద దాచిన ప్యాకెట్లను తనిఖీ చేయగా 20 కిలోల గంజాయి పట్టుబడింది. రవాణా చేస్తున్న నిందితుడు తప్పించుకున్నాడు. అతడి కోసం గాలింపులు చేపట్టారు.
