- డీజీపీకి రాములునాయక్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గిరిజనుల మధ్య చిచ్చుపెట్టేలా బీజేపీ ఎంపీ సోయం బాపురావు అనుచిత కామెంట్లు చేశారని..ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్నేత, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన డీజీపీ అంజనీ కుమార్కు సోయంపై ఫిర్యాదు చేశారు.
సోయం లంబాడీలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. లంబాడీ, ఆదివాసీల మధ్య అల్లర్లు సృష్టించి అశాంతి రేపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాములు నాయక్ డీజీపీని కోరారు.