బీఆర్ఎస్కు బిగ్ షాక్ .. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌ గుడ్‌బై

బీఆర్ఎస్కు బిగ్ షాక్ ..  రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌ గుడ్‌బై

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది.   ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌ మనోహర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.  మనోహర్ రెడ్డి  కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటికే ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.  2023 అక్టోబర్ 05 న  మనోహర్ రెడ్డి నివాసంలో బ్రేక్ ఫాస్ట్ భేటీ జరగనుంది .

Also Read :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుని ఇంట్లో ఐటీ సోదాలు

 ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ హాజరు కానున్నారు.  కాగా మనోహర్ రెడ్డి తాండూరు నుంచి  కాంగ్రెస్ తరుపున  టికెట్ ఆశిస్తున్నారు.   ఎల్లుండి ఢిల్లీలో మనోహర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.